ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాక బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్కే రాష్ట్ర ప్రజలకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో కూడా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. గ్రామీణ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పూర్తిగా విస్తరించింది. అయితే 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకే వస్తుందని చాలామంది భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకుంది. దీంతో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది.
పూర్తిగా చదవండి..Telangana: కవిత రాకతో బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్.. కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ అదేనా !
కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది పార్టీకి సవాలుగా మారనుంది. దీంతో ఈ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Translate this News: