దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు ముగిశాయి. ఈ మేరకు అధికారులు ఆదివారం వెల్లడించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కోల్కతా జైల్లో ఉన్న అతడికి అక్కడే ఈ టెస్టు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా సీబీఐ కార్యాలయంలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Kolkata Doctor Case: నిందితుడికి ముగిసిన పాలిగ్రాఫ్ టెస్ట్.. రిపోర్టులో ఏముంది ?
కోల్కతా అభయ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా టెస్టులు జరిగాయి. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
Translate this News: