దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన, బద్లాపూర్లోని ఓ స్కూల్లో బాలికలపై లైంగిక దాడి, అస్సాంలో గ్యాంగ్ రెప్ లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నామని అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ
మహిళలపై నేరాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. నేరస్తులను శిక్షించేందుకు భారతీయ న్యాయ సన్హిత (BNS)ను తీసుకొచ్చి ఇందులో అనే అనేక సవరణలు చేశామని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Translate this News: