పారిస్ ఒలింపిక్స్ గేమ్స్లో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం భారత్కు తిరిగివచ్చారు. ఈవెంట్ నుంచి ఆమె డిస్క్వాలిఫై అయ్యాక సిల్వర్ మెడల్ కోసం కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో అప్పీల్ చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే వినేశ్.. ఆగస్టు 17న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆమెను స్వాగతం పలికేందుకు రేజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు మరికొంత మంది ఎయిర్పోర్టుకు తరలివచ్చారు.
పూర్తిగా చదవండి..Watch Video: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు
శనివారం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వినేశ్ ఫొగాట్కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు వచ్చారు. వినేశ్ ఎక్కిన కారుపై జాతీయ జెండా గుర్తులు ఉన్న పోస్టర్ను అలకరించారు. దానిపై బజరంగ్ పూనియా నిల్చోవడంతో అతడిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు,
Translate this News: