అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరగకుండానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఖమ్మం జిల్లాలో మూడో విడత రైతు రుణమాఫీ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.31 వేల కోట్లతో రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చామన్నారు. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. 27 రోజుల్లో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారని గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్!
ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు హరీశ్ రావు కట్టబడి ఉండాలన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఓడించి తీరుతామన్నారు. పథకాలు, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.
Translate this News: