తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఊహించని అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చింది. రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఇక్కడి నుంచి రాజ్యసభ బరిలో దించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కేకే రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సింఘ్వి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన సీటు ఖాళీ అయ్యింది.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. ఆ సంచలన నేతకు ఛాన్స్!
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కేకే రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.
Translate this News: