KTR: నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై (Megha Company) పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా కూడా ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ ఇంకా చర్యలు తీసుకోలేదు.
పూర్తిగా చదవండి..Sunkishala Project: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్
సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలి 10 రోజులు గడిచినా కూడా మేఘా కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: