AP Government: అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలుకాలని అలాగే వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచనలు చేసింది. వీటికి సంబంధించిన గైడ్లైన్స్ను వివరిస్తూ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ అంత్యక్రియలకు హాజరయ్యేలా ఆదేశాలిస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..
అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు.
Translate this News: