TDP Politburo Meeting: ఈరోజు టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం కానుంది. మిషన్ 202 లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది టీడీపీ. పార్టీని సంస్థాగత బలోపేతంపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ, మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై చర్చ జరగనుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానికి సంస్థల ఎన్నికపై టీడీపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించగా.. కూటమి మాత్రం ఇంకా తమ అభ్యర్థికి ప్రకటించలేదు. కాగా ఈరోజు జరిగే సమావేశంలో అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
పూర్తిగా చదవండి..TDP: నేడు టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం
AP: ఈరోజు టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం కానుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై , మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Translate this News: