ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం రైల్ నిలయంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో పొంగులేటి సమావేశం అయ్యారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్ గూడెం మీదుగా సూర్యపేట జిల్లా మోతే నుంచి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గంపై చర్చించారు. తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఈ రైల్వే మార్గం వెళ్తుందని వివరించారు. దీనివల్ల రైతులు సాగు భూమలను రైతులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు.
Translate this News: