India Vs Sri lanka: టీ20 సీరీస్ అయిపోయింది…ఇప్పుడు శ్రీలంకతో వన్డే సీరీస్ మొదలయింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్ టైగా ముగిసింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. నిశాంక(56), దునీత్(67) అర్ధ సెంచరీలు చేశారు. ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్, దుబె, కుల్దీప్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. తర్వాత 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (58) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33), కేఎల్ రాహుల్ (31), శివమ్ దూబె(25), కోహ్లీ (24) పరుగులు చేశారు.
పూర్తిగా చదవండి..Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై
ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
Translate this News: