Waynad Nature Disaster: కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 108 మంది మరణించారు. గ్రామాలకు గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కొంతమందినే వెలికితీయగలిగారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కకుని పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం, జూలై 30, బుధవారం, జూలై 31వ తేదీలలో రెండు రోజుల రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించారు. ఈ ప్రమాదంలో 116 గాయాలవగా.. చాలామంది అచూకీ తెలియలేదని కేరళ రెవెన్యూ మంత్రి కార్యాలయం నివేదించింది.
పూర్తిగా చదవండి..Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్లో విలయం
వయనాడ్లో జరిగిన బీభత్సం అందరినీ భయపెడుతోంది. భారతదేశానికి ఏమైంది అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వాతావరణశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఈ భారీ విలయానికి ఆశ్చర్యపోతున్నారు. అరేబియా సముద్రం విపరీతంగా వేడెక్కడమే ఈ విలయానికి కారణం అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: