Kalwakurthy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కు నిరసన సెగ తగిలింది. కల్వకుర్తి సభలో రేవంత్ మాట్లాడుతుండగా కొంతమంది మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. సభ మధ్యలో నిలబడిన మహిళలు ‘దయగల సీఎం మాకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వండి. 80 లక్షల బడ్జెట్ డబుల్ బెడ్రూమ్ లు కేటాయించండి’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని చూపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళల దగ్గర నుండి ప్లకార్డులు లాక్కుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పూర్తిగా చదవండి..CM REVANTH: కల్వకుర్తిలో సీఎం రేవంత్కు నిరసన సెగ.. మహిళల ఆందోళన!
కల్వకుర్తి బహిరంగసభలో సీఎం రేవంత్కు నిరసన సెగ తగిలింది. 'దయగల సీఎం మాకు 80 లక్షల బడ్జెట్ డబుల్ బెడ్రూమ్లు కేటాయించండి' అంటూ పలువురు మహిళలు ప్లకార్డులు చూపించారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Translate this News: