Operation Sarp Vinas: జమ్మూ-కశ్మీర్లో ఈ మధ్య ఉగ్రవాదులదాడులు చాలా ఎక్కువయ్యాయి. గత నెల రోజులుగా అక్కడ పలు ప్రాంతాల్లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా టెర్రరిస్టులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత ఆర్మీయే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు. అందుకే ఇప్పుడు వారిని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకుంది ఇండియన్ ఆర్మీ. దీని కోసం ఇండియన్ ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 ను మొదలుపెట్టింది. ప్రధాని కార్యాలయం ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగస్వాములైన అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..National: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా..ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయడానికి నిర్ణయించుకుంది భారత ఆర్మీ. దీని కోసం ఆపరేషన్ను మొదలుపెట్టింది. పీఎంవో ఆపరేషన్ సర్ప వినాశ్ 2.0 పేరుతో ఉగ్రవాదులను మట్టుపెట్టనుంది భారత ఆర్మీ.
Translate this News: