AP Liquor Policy: ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడి దర్యాప్తు కు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. జగన్ (YS Jagan) హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై సభలో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సైతం రిఫర్ చేస్తామన్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. ఇది ఓ భయంకరమైన స్కాం అని అన్నారు.
పూర్తిగా చదవండి..CID Enquiry: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈడీకి కూడా ఈ కేసును రిఫర్ చేస్తామన్నారు.
Translate this News: