నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్ష తుది ఫలితాలు మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు.
సుప్రీం కోర్టు చేసిన పరిశీలనల ప్రకారం పరీక్ష మెరిట్ జాబితాను సవరిస్తామని తెలిపారు. నీట్ అంశంపై విపక్షాలు అరాచకం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు.
NEET: సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే నీట్-యూజీ పరీక్ష తుది ఫలితాలు మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు.
Translate this News: