Rahul Gandhi Over Union Budget 2024: 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థి మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదే. తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధికల్పన, సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధి, తర్వాతితరం సంస్కరణలు.. ఇలా మొత్తం తొమ్మిది సూత్రాల ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్ను తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తన ప్రసంగలో ప్రకటించారు. ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికీ కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు.
పూర్తిగా చదవండి..Budget 2024: కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్
2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేశారని.. AA( అంబానీ, అదానీ)లకు ప్రయోజనం చేకూర్చారంటూ రాహుల్గాంధీ ఎక్స్ వేదికగా విమర్శించారు.
Translate this News: