CM Chandrababu: కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని (AP Capital) నిర్మాణంకోసం బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి (Amaravati) మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో చిగురించిందన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం జరిగుంటే మరో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద కూడా వచ్చి ఉండేదని చెప్పారు. గత పాలకుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయింది. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్లో (Union Budget 2024) ఆర్థిక మంత్రి నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మారుస్తూ అంతా పాడు చేశారంటూ మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు!
ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు.
Translate this News: