మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా (HYDRAA) అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోపన్పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్ను అనుమతించారు.
ఇది కూడా చదవండి: Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
CM Revanth Reddy: హైదరాబాద్ వాసులకు రేవంత్ శుభవార్త.. మూసీ అభివృద్ధికి ఎన్ని వేల కోట్లంటే?
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ తయ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.1.50 లక్షల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామన్నారు. ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీని అభివృద్ధి చేస్తామన్నారు.
Translate this News: