Naga Babu: వినుకొండలో రషీద్ హత్యపై మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన నేత నాగబాబు. ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కూడా కాలేదు.. అప్పుడే విమర్శలా? అని విమర్శించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో చూశాం అని అన్నారు. జగన్ మరోసారి రాకుండా చేసి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని చెప్పారు.
పూర్తిగా చదవండి..Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు
AP: మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు జనసేన నేత నాగబాబు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేత జగన్ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Translate this News: