Jagan: పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించారు. రాజ్యసభలో సంఖ్యాపరంగా కీలకంగా ఉండటంతో ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. వినుకొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో చేసే ధర్నాపైనా చర్చించారు. పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేయాలా?.. లేదంటే బయట చేయాలన్న దానిపై చర్చలు జరిపారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాలని ధర్నా రోజే కలిసేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీలకు సూచనలు చేశారు. ధర్నాను కలిసి వచ్చే పార్టీలను పిలవాలని ఆదేశించారు.
Jagan: వైసీపీని చంద్రబాబు అణగదొక్కలేరు.. జగన్ కీలక వ్యాఖ్యలు
AP: రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలతో అన్నారు జగన్. 15 సంవత్సరాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కలేరని అన్నారు.
Translate this News: