సీఎం రేవంత్పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ఎక్స్లో ట్వీట్ చేశారు. రబీ, ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా..? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా..? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా..? అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా అంటూ విమర్శించారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: ఏం సాధించారని సంబరాలు?.. డ్రామాలు ఆపండి: బండి ఫైర్
రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి.. ఆ నిధులతో రుణమాఫీ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకే ఈ డ్రామా అని విమర్శించారు.
Translate this News: