YS Sharmila: వినుకొండ హత్య ఘటనపై ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం అని అన్నారు. ప్రతి ఒక్కరూ గొంతెత్తి ఖండించాల్సిన చర్య అని పేర్కొన్నారు. ఇంకెంత క్షీణించాలి శాంతిభద్రతలు రాష్ట్రంలో! అని ప్రశ్నించారు. నడిరోడ్డు మీద ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏమి చేస్తున్నట్టు అని మండిపడ్డారు. ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: ఇది మీకు మంచిది కాదు.. కూటమి ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక
AP: వినుకొండ హత్య ఘటనపై షర్మిల స్పందిచారు. ఇలాంటి ఘటన జరగడం దారుణమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ హత్య అయితే, కూటమి సర్కారుకు ఇదే హెచ్చరికని అన్నారు. ఇలాంటి దాడులు మీకు, రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
Translate this News: