వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయాన్ని సోమవారం రోజా తన భర్త సెల్వమణితో కలిసి సందర్శించారు. వరుషాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారు రోజా సెల్పీలు తీసుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా రోజా ప్రవర్తన సరిగా లేదంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
పూర్తిగా చదవండి..YSRCP Roja: పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్న రోజా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు!
తనతో సెల్ఫీ తీసుకోవడానికి వస్తున్న పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్నట్లు రోజా సైగలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగా కూడా పని చేసిన రోజా పారిశుధ్య కార్మికులతో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
Translate this News: