Jammu-kashmir: జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. కుప్వారా జిల్లా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ (Indian Army) ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి టెర్రరిలస్టులు చొరబాటుకు యత్నించారు. దీంతో వాళ్లపై భద్రతా దళం కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ తర్వాత వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఆదివారం ధనుష్ – 2 (Dhanush – 2) అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్లో టెర్రరిస్టులను ఏరివేత ఆపరేషన్ను భద్రతా బలగాలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Terror Attack: భారత్లో కల్లోలానికి ఉగ్రవాదుల ప్లాన్
జమ్మూ-కశ్మీర్లో కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహత్తుల్లో భరత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి. అమర్నాథ్ యాత్రలో కల్లోలం సృష్టించాలనుకున్నారని తెలిపారు.
Translate this News: