మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో మరోసారి సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిరిబామ్లో సీఆర్పీఎస్, పోలీసు బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. జులై 13న అక్కడ కాల్పులు జరగడంతో దీనికి సంబంధించి ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 9.40 గంటల సమయంలో కొందరు గుర్తుతెలియని సాయుధులు జవాన్లపై దాడులకు పాల్పడ్డారు. దీంతో దుండగులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
పూర్తిగా చదవండి..Manipur: మణిపూర్లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి
మణిపుర్లోని జిరిబామ్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. జులై 13న అక్కడ కాల్పులు జరగడంతో దీనికి సంబంధించి ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి.
Translate this News: