ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కొత్త అధికారిగా ఐఏఎస్ వివేక్ యాదవ్ మరికొన్ని రోజుల్లో ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. ఈ సమయంలో.. అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి వెళ్లాయి. ఇప్పుడు కూడా ఈయనకు కీలకశాఖను అప్పగిస్తారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీ కొత్త సీఈవోగా వివేక్ యాదవ్..
ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే ఎంకే మీనాను పూర్తిగా పంపించేయకుండా...కీలకశాఖలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Translate this News: