Terrorists Attack On Indian Army Van: మొన్నటికి మొన్న జమ్మూ-కశ్మీర్లో భారత సైనికుల వెహికల్ మీద మెరుపు దాడి చేసి ఐదుగురు జవాన్ల మరణానికి కారణం అయిన ఉగ్రవాదులు ఈరోజు మళ్ళీ కాల్పులు చేశారు. ఆరోజు తమ వాహనంపై టెర్రరిస్టులు దాడి మొదలుపెట్టిన వెంటనే భారత సైన్యం.. ప్రతిదాడులతో విరుచుకుపడింది. గాయపడిన సైనికులను రక్షించుకోవడంతోపాటు మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించింది. సడెన్గా దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు అప్పటికే చనిపోయారు. దాంతో మరింత మంది చనిపోకుండా ఉండేందుకు, ఆయుధాలను ఎత్తుకెళ్లిపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు జవాన్లు కష్టపడ్డారు. ఈ క్రమంలో ఒక జవాన్ తన ఒక చేతికి దెబ్బ తగిలినా రెండో చేతితో తన ఆయుధంలో బుల్లెట్లు అయ్యేవరకు కాల్పులు జరిపారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Jammu-Kashmir: కఠువాలో ఎన్ కౌంటర్.. 2గంటలు, 5189 రౌండ్ల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు వరుసగా దాడులు జరుపుతూనే ఉన్నారు. గత రెండు నెలల్లో ఇప్పటికి పదిసార్లు దాడులు చేశారు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు భారత సైన్యం వాహనం మీద దాడి చేసినప్పుడు మన ఆర్మీ 22 గడ్వాల్ రెజిమెంట్ దాదాపు 5189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు.
Translate this News: