India VS Zimbabwe: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. తరువాత 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. ఇక మొదట రెండు మ్యాచ్లలో విఫలమయిన కెప్టెన్ శుభమన్గిల్ మూడో మ్యాచ్లో బాగా ఆడాడు. గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లో 66 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన అభషేక్ వర్మ తొందరగానే ఆవుట్ అయిపోయినా రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సంజు శాంసన్ (12*; 7 బంతుల్లో 2 ఫోర్లు) నాటౌట్గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.
పూర్తిగా చదవండి..Cricket: మూడో టీ20లో గెలిచిన టీమ్ ఇండియా
సెటిల్ అవడానికి ఒక మ్యాచ్ను తీసుకున్న యంగ్ టీమ్ ఇండియా వరుసగా మ్యాచ్లను గెలుస్తూ వస్తోంది. ఈరోజు జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్లోనూ భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ సమిష్టిగా రాణించారు టీమ్ ఇండియా కుర్రాళ్ళు.
Translate this News: