SIT Report On Hathras Stampede: ఉత్తరప్రదేశ్లోని హథ్రస్లో జరిగిన భోలే బాబా (Bhole Baba) సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని సీరియస్గా తీసుకున్న యూపీ సర్కార్ ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిట్.. నివేదికను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొక్కిసలాటకు ఈవెంట్ నిర్వాకులదే బాధ్యత అని.. స్థానిక యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందని సిట్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Hathras Stampede: హథ్రస్ తొక్కిసలాటకు కారణం ?.. కీలక విషయాలు బయటపెట్టిన సిట్
యూపీలో హథ్రస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన సిట్ కీలక విషయాలు వెల్లడించింది. తొక్కిసలాటకు ఈవెంట్ నిర్వాకులదే బాధ్యత అని.. స్థానిక యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందని పేర్కొంది. ఈ ఘటనలో కుట్ర ఉన్నట్లు కూడా కొట్టిపారేయలేమని చెప్పింది.
Translate this News: