జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భారత సైన్యానికి చెందిన కాన్వాయ్పై సోమవారం ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచెడి-కిండ్లీ రోడ్డు మార్గంలో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తాజాగా ఈ ఘటనపై భారత్ స్పందించింది. కథువా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి నిస్వార్థ సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదని.. ఈ దాడి వెనుక ఉన్న దృష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదని ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Kathua Terrorist Attack: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన భారత్.. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Translate this News: