YSR Jayanthi Celebrations: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారు వైఎస్తో ఉన్న తమ అనుభవాలను, ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘YSR జ్ఞాపకాలు మనకు శాశ్వతం. ఆయనే సంక్షేమ పథకాల సృష్టి కర్త. YSR జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ పేదవాళ్ళ గుండెల్లో బల పడుతున్నాయి.YSR లేని లోటు మనకు స్పష్టం గా కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్నా అభిమానులకు కొదువ లేదు. YSR తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. అప్పట్లో మొదటి సారి శాసనమండలిలో నేను అడుగు పెట్టాను.YSR దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించే వాడిని. పిల్లవాడు అని కాకుండా YSR ప్రతి అంశానికి సమాధానం చెప్పేవారు. కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారు అనేవారు. వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలని అనేవారు. కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చొనేవారు. ఇదే నాయకుడు లక్ష్యం.
పూర్తిగా చదవండి..YSR Jayanthi Celebrations: వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్, షర్మిల కీలక వ్యాఖ్యలు
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ స్పూర్తితోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. కడపలో ఉపఎన్నికలు వస్తే తానే బాధ్యత తీసుకుంటానన్నారు. వైఎస్సార్ ఆశయాలను తుంగలో తొక్కారంటూ వైఎస్ షర్మిలా పరోక్షంగా జగన్ను విమర్శించారు.
Translate this News: