NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. మరికొందరు మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీకోర్టులో (Supreme Court) దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ (D.Y. Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నీటి పరీక్షకు 24 గంటల ముందు క్వశ్చన్ పేపర్ వాట్సాప్, టెలిగ్రామ్లో లీక్ అయ్యిందనేది వాస్తవం. సోషల్ మీడియాలో లీకవ్వడం వల్ల అది విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కానీ ఎంతవరకు వ్యాప్తి చెందింది అనేదానిపై క్లారిటీ లేదు.
పూర్తిగా చదవండి..NEET Paper Leak: ముగిసిన నీట్ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన వారందరూ ఒక నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలని చీఫ్ జస్టీస్ ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Translate this News: