CM Revanth Reddy: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే ప్రాజెక్టుల మీద నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్ తో పాటు ఇటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి ఆరా తీశారు.
Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి
తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు.
Translate this News: