Deputy CM Bhatti Vikramarka: పెండింగ్ సమస్యలు అన్నింటికి ఈ సమావేశంలో నే పరిష్కారం లభిస్తుంది అని మేము అనుకోలేదు కానీ గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ చర్చించారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే పరిష్కార మార్గాలకు మాత్రం నిర్ణయం జరిగిందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో త్రిమెన్ కమిటీ వేయాలని నిర్ణయించామని అన్నారు.రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని భట్టి వెల్లడించారు.అలాగే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తామని..అధికారుల స్థాయిలో పరిష్కారం కానీ అంశాలను మంత్రుల స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. ఒకవేళ మంత్రుల స్థాయిలో కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే…ఆ అంశాలపై మరోసారి సీఎం ల స్థాయిలో భేటి అవతారని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telanagna: పదేళ్ళల్లో పరిష్కారం కాని అంశాలపై చర్చించాం- భట్టి విక్రమార్క
గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై చర్చించామని చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే పండింగ్ సమస్యలన్నీ ఒక్కసారే పరిష్కారం అవుతాయని తాము అనుకోలేదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మంత్రులతో కమిటీ వేస్తామని తెలిపారు.
Translate this News: