Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా (Hathras District) లో భోలే బాబా (Bhole Baba) ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం పరారీలో ఉన్న నారాయణ్ సాకార్ హరి అలియస్ భోలే బాబా కోసం గాలిస్తున్నామని అలీగఢ్ ఐజీ శాలభ్ మథురు తెలిపారు. అతడిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. దొరికిన వెంటనే విచారణ చేస్తామని.. ఈ ఘటనలో ఆయన బాధ్యత ఉంటే అరెస్టు చేస్తామని చెప్పారు.
పూర్తిగా చదవండి..Bhole Baba : భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు
యూపీలో హత్రాస్లో తొక్కిసలాట జరిగిన అనంతరం ఎక్కడ చూసినా భోలే బాబా పేరు వినిపిస్తోంది. అయితే అతనికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకి వస్తున్నాయి. భోలే బాబాకు 24 ఆశ్రమలు, లగ్జరీ కార్లు ఉన్నాయని.. మొత్తం రూ.100 కోట్ల వరకు ఆస్తి ఉందని ఓ జాతీయ మీడియా వెల్లడించింది.
Translate this News: