అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతి ఉంటుందని చంద్రబాబు అన్నారు. అందుకే అక్కడ రాజధానిని నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రతీ ఒక్కరూ అంగీకరించే నిర్ణయం ఇది అన్నారు. పవిత్ర లక్ష్యంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు. అమరావతి పేరును నాడు కేబినెట్ లో వందశాతం అంగీకరించారన్నారు. అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని గుర్తు చేశారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి పవిత్ర నీరు, మట్టి తీసుకువచ్చామన్నారు. పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉందన్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకువచ్చారన్నారు. అందరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేశామన్నారు.
పూర్తిగా చదవండి..Amaravati: ఏపీకి శాపంగా జగన్.. అమరావతిని ఎలా నాశనం చేశాడంటే: చంద్రబాబు-LIVE
అవరావతిని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నాశనం చేశాడని సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఏపీకి జగన్ శాపంగా మారాడన్నారు. ప్రజావేదిక కూలగొట్టడంతో అమరావతిలో విధ్వంసం ప్రారంభించాడన్నారు. అమరావతిపై చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేశారు.
Translate this News: