Panchayat Secretary : వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ రెచ్చిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) సిద్ధాంతం గ్రామంలో ఈ ఘటన జరిగింది. కేజీ నేరేడు పండ్లు (Apricots) 50 రూపాయలకు ఇవ్వనందుకు వీధి వ్యాపారిపై దౌర్జన్యం చేశాడు. వ్యాపారి తోపుడు బండి మీద వున్న కాటా తీసుకెళ్ళిపోయిన సెక్రటరీ.. రోడ్డుపై వ్యాపారం ఎలా చేస్తవో చూస్తానంటూ బెదిరించాడు. రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ తోపుడు బండి వ్యాపారిపై వాగ్వివాదానికి దిగాడు.
పూర్తిగా చదవండి..AP : కేజీ నేరేడు పండ్ల కోసం కొట్లాట.. వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ దౌర్జన్యం..!
పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ రెచ్చిపోయాడు. కేజీ నేరేడు పండ్లు 50 రూపాయలకు ఇవ్వనందుకు వ్యాపారి తోపుడు బండి మీద వున్న కాటా తీసుకెళ్ళిపోయాడు. రోడ్డుపై వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ సెక్రటరీ బెదిరింపులకు దిగాడు.
Translate this News: