Polavaram Project Reverse Tendering : జీవనది గోదావరిపై నిర్మించ తలపెట్టిన పెద్ద ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project). దీనిని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వరప్రదాయనిగా భావిస్తారు. దానిలో మరో మాట కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగు, తాగు నీరు ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి లోనూ పారిశ్రామిక అవసరాలను తీర్చడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది మొదలు ఎదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల కొరత, రాజకీయ కారణాలతో రోజులు గడుస్తున్నా ప్రాజెక్ట్ పనులు మాత్రం పూర్తి కావడంలేదు. దీనికి జగనే కారణమని టీడీపీ (TDP) నిత్యం విమర్శలు గుప్పిస్తోంది.. ఈ క్రమంలోనే నాడు కేంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే.జైన్ 2019లో రాసిన లెటర్ను టీడీపీ సోషల్మీడియాలో వైరల్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Jagan vs TDP : ‘రాష్ట్రానికి, పోలవరానికి జగన్ ఒక శని…’ టీడీపీ ఘాటు విమర్శలు!
పోలవరం కాంట్రాక్టర్ను మార్చితే అది తివ్రమైన విపత్తుకు దారి తీస్తుందని 2019లో నాటి వైసీపీ సర్కార్కు జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఆ లెటర్ను ఇప్పుడు టీడీపీ వైరల్ చేస్తోంది. రివర్స్ టెండర్ ఆలోచన సరైనది కాదని మండిపడుతోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అని ఫైర్ అవుతోంది.
Translate this News: