T20 WC Final : ఈ టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్లాప్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. పైగా ఓపెనరగా బరిలోకి దిగుతున్నాడు. నిజానికి కోహ్లీ వన్-డౌన్లో మంచి బేటర్. అయితే ఐపీఎల్ (IPL) లో ఓపెనర్గా పరుగుల వరద పారించిన కోహ్లీని మ్యానేజ్మెంట్ టీ20 వరల్డ్కప్ (T20 World Cup) లో ఓపెనర్గా ప్రమోట్ చేసింది. ఈ నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే అసలు కోహ్లీ పరుగులు చేయడానికి నానాతంటాలు పడుతున్నాడు. మరో ఓపెనర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతుంటే కోహ్లీ మాత్రం వికెట్ పారేసుకుంటున్నాడు. వెస్టీండిస్, అమెరికా పిచ్లపై కోహ్లీ ఆట అంతంతమాత్రమేనని అర్థమవుతోంది. ఇక ఇవాళ(జున్ 29) సౌతాఫ్రికాపై పైనల మ్యాచ్ ఉండడంతో అసలు టీమ్లో కోహ్లీని ఆడించడం అవసరమానన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిగా చదవండి..IND vs SA : ఫైనల్లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్ మదిలో ఏముంది?
సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ను ఆడించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓపెనర్గా అట్టర్ఫ్లాప్ అవుతున్న కోహ్లీని వన్-డౌన్లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట.
Translate this News: