Minister Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టుతో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ఏడాదే వైరా ప్రాజెక్టు వరకు నీళ్లు అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించినా, శంకుస్థాపన జరిగి ఏడేళ్ళు అయినా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మంత్రిగా అవకాశం దక్కించుకున్న తుమ్మల.. సీతారామ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టి గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో పనులు చేయిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు.
Translate this News: