ఏపీలో వాలంటీర్లకు బిగ్ షాక్ మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదన్న పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయ స్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో పెన్షన్లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగులతో పంపింణీ చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమను తప్పిస్తారేమోనన్న ఆందోళన వాలంటీర్లలో మొదలైంది. ఈ తరుణంలో వాలంటీర్లను తప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వారి ఆందోళన రెట్టింపైంది. ఈ అంశంపై కోర్టు ఎలా స్పందిస్తుందనే అంశం ఏపీలో ఉత్కంఠగా మారింది.
పూర్తిగా చదవండి..AP Volunteers: ఏపీలో వాలంటీర్లకు ఊహించని షాక్
ఏపీలో వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని దీంతో వారి నియామకం చెల్లదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Translate this News: