Kerala to Rename As Keralam: దేశంలో అక్షరాస్యత ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏదంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది కేరళ. అయితే ఇప్పుడు కేరళ పేరు కేరళంగా మారే అవకాశాలున్నాయి. తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి ‘కేరళం’గా మారుస్తూ.. అసెంబ్లీలో (Assembly) ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 (Article 3) ప్రకారం.. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రానికి పేరును మార్చుకునే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పినరయి విజయన్ (Pinarayi Vijayan) ప్రభుత్వం తమ రాష్ట్ర పేరును మార్చాలని నిర్ణయించుకుంది.
పూర్తిగా చదవండి..Kerala: కేరళ కాదు కేరళం.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అక్కడి ప్రభుత్వం. గత ఏడాది కూడా ఈ తీర్మానం ఆమోదం పొందినప్పటికీ కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో కొన్ని మార్పులు చేసి కొత్త తీర్మానాన్ని ఆమోదించారు.
Translate this News: