NEET Paper Leak : నీట్ (NEET) పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పరీక్షను రద్దు చేస్తారా లేదా జరిగిన అవకతవకతలను సరిచేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే బిహార్ (Bihar) కు చెందిన అనురాగ్ యాదవ్(22) అనే విద్యార్థి.. పరీక్షకు ముందు తనవద్దకు నీట్ పేపర్ వచ్చినట్లు పోలీసులకు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న తన అంకుల్ సికిందర్ యాదవేందు నుంచి క్వశ్చన్ పేపర్ను, ఆన్సర్ షీట్ పొందానని.. రాత్రంతా వాటిని బట్టిపట్టానని తెలిపాడు. ఆయన ఇచ్చిన క్వశ్చన్ పేపర్… అసలు పరీక్షలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్కు మ్యాచ్ అయ్యిందని పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..NEET Scam : నీట్ పేపర్ లీకైనా.. అతడికి తక్కువ మార్కులు !
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. అనురాగ్ యాదవ్ తనకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పడం సంచలనం రేపింది. తన అంకుల్ ఇచ్చిన పేపర్.. పరీక్షలో వచ్చిన పేపర్ మ్యాచ్ అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ అతడికి 720 మార్కులకు185 మార్కులే రావడం గమనార్హం.
Translate this News: