తెలంగాణ ప్రజాలారా… ఇదే మీ అందరికీ ఇదే నా సెల్యూట్ అంటూ కేంద్ర మంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలతో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారిని నిన్న ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టార్జితం మరువలేనిదన్నారు. కార్యకర్తలతోపాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు.
పూర్తిగా చదవండి..భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం- బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి రాగానే..భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ .అమ్మవారి దయవల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసే వరకు పోరాడతామని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: