కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న 23 లక్షల తల్లిదండ్రుల, విద్యార్థుల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజు(జూన్ 4)న విడుదలైన నీట్ రిజల్ట్స్ ఆధారంగా పరీక్ష నిర్వహణ తీరు గమనిస్తే పేపర్ లీక్ అయిందని అర్థంకాక మానదు. దేశంలో అత్యంత కఠినంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్లో గతంలో ఎప్పుడూలేని విధంగా 62 మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అందులో 8 మంది విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ నుంచి సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. అలాంటిది.. ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రతి మదినీ తొలిచే ప్రశ్న. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి మరి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటమంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ ) కుట్ర అర్థం అవ్తుంది. దేశ ప్రజల, విద్యార్థుల దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉండగా ఎన్టీఏ నీట్ ఫలితాలను విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
పూర్తిగా చదవండి..NEET Scam: నీట్ అవకతవకలపై మోడీ మౌనం వీడాలి
నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు బయటపడటం విద్యార్థులు భవిష్త్యత్తు ఏంటీ అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఓవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై స్పందించాలని పలువురు నిపుణలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: