NTA : నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. దీంతో సుప్రీం మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్ష నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా ఇందుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంకా పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది.
పూర్తిగా చదవండి..NEET 2024 Paper Leak : నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. నీట్ పై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిగింది.
Translate this News: