Nara Lokesh: ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. నారా లోకేష్ కు హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన ‘X’ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానన్నారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త!
ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు భారీగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు 'X' ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
Translate this News: