మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. అక్కడ 84 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. భింద్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితమైంది. దీనివల్లే అక్కడి స్థానిక ప్రజలకు కలరా సోకింది. ఈ వ్యాధికి గురైనవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న రోగులు ఇంటికి వెళ్లారని.. ప్రస్తుతం ఆరుగురు రోగులు ఆసుపత్రిలో ఉన్నారని చీఫ్ మెడికల్, ఆరోగ్య అధికారి డీకే శర్మ తెలిపారు. మరో ఇద్దరు రోగులను గ్వాలియర్ ఆసుపత్రికి తరలించగా వారు కోలుకొని తిరిగివచ్చినట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Cholera: కలరా కలకలం.. 80 మందికి సోకిన వ్యాధి
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 84 మంది కలరా బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితం కావడంతోనే అక్కడి స్థానికులకు కలరా సోకిందని వైద్యులు తెలిపారు.
Translate this News: