KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటం చేశారని.. వారందరు సదా స్మరణీయులు అని అన్నారు. 1969లో ఉద్యమానికి ప్రధాన కారణం ముల్కీ రూల్స్ అని పేర్కొన్నారు. ఈ ముల్కీ రూల్స్ పై ఆనాడు విద్యార్థులు, యువకులు పోరాడారు అని అన్నారు. ఆ తర్వాత ఉద్యమం సమసిపోయిందని పేర్కొన్నారు. ముల్కీ రూల్స్ పై తెలంగాణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందని అన్నారు. ఆ వెంటనే జై ఆంధ్ర ఉద్యమం వచ్చినట్లు చెప్పారు. అక్కడ కూడా 70 మందికిపైగా చనిపోయారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును కూడా కాలరాసి రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ రూల్స్ రద్దు చేశారని పేర్కొన్నారు. ఏనాటికైనా కేసీఆర్ లాంటి నాయకుడు రాబోడా అనే ఆశతోనే పోరాటం చేశామని ప్రొఫెసర్ జయశంకర్ తనతో అన్నారని గుర్తు చేశారు.
KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా? అని ప్రశ్నించారు. కేవలం ఒక శాతం తేడాతో ఓడిపోయామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
Translate this News: